×
Ad

Model and actor Poonam Pandey : మాల్దీవుల్లో పిజ్జా రూ.5వేలు… షూటింగ్ మాల్దీవుల నుంచి లక్షద్వీప్‌కు మార్చుకున్న పూనమ్ పాండే

మాల్దీవుల్లో పిజ్జా ధర 5వేల రూపాయలా? అవునంటున్నారు ప్రముఖ సినీనటి, మోడల్ పూనమ్ పాండే. మాల్దీవుల్లో పిజ్జా ధర ఐదువేల రూపాయలు కాబ్టి మనం మన దేశంలోనే పిజ్జా తినడం మంచిదని పూనమ్ వ్యాఖ్యానించారు....

  • Published On : January 9, 2024 / 08:36 AM IST

Poonam Pandey

Model and actor Poonam Pandey : మాల్దీవుల్లో పిజ్జా ధర 5వేల రూపాయలా? అవునంటున్నారు ప్రముఖ సినీనటి, మోడల్ పూనమ్ పాండే. మాల్దీవుల్లో పిజ్జా ధర ఐదువేల రూపాయలు కాబ్టి మనం మన దేశంలోనే పిజ్జా తినడం మంచిదని పూనమ్ వ్యాఖ్యానించారు. మోడల్, సినీనటి పూనమ్ పాండే మాల్దీవులలో తన రాబోయే షూటింగ్‌ను రద్దు చేసుకున్నారు. మాల్దీవులకు బదులుగా లొకేషన్‌ను లక్షద్వీప్‌కు మార్చాలని నిర్ణయించుకుంది.

ALSO READ : Cold wave : ఢిల్లీని వణికిస్తున్న చలిగాలులు…పలు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు

పూనమ్ నిర్ణయం మాల్దీవుల రాజకీయ దృష్టాంతానికి సంబంధించిన వివాదాల మధ్య తీసుకుంది. పూనమ్ తన దేశం పట్ల తన నిబద్ధతకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల నేతల అవమానకరమైన వ్యాఖ్యలతో పలువురు ప్రముఖులు మాల్దీవుల ద్వీప దేశానికి వెళ్లాలనుకున్న పర్యటనలను రద్దు చేసుకున్నారు.

ALSO READ : Brazil : బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం…25మంది మృతి

పూనమ్ పాండే మళ్లీ మాల్దీవులలో షూటింగ్ చేయనని ప్రకటించింది. తన షూటింగ్ మాల్దీవుల స్థానంలో లక్షద్వీప్ లో ఉంటుందని పూనమ్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.