PM MoDi : ‘WTO అనుమతిస్తే ప్రపంచానికి ఆహారం అందించటానికి భారత్ సిద్ధంగా ఉంది’..

ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతిస్తే ప్రపంచానికి ఆహారం అందించటానికి భారత్ సిద్ధంగా ఉంది’ అని ప్రధాని మోడీ వెల్లడించారు.

Modi said if WTO agree India will supply food to the world : ‘భారత్ లో ఇప్పటికే తమ ప్రజలకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయనీ..కాబట్టి ప్రపంచానికి ఆహారం అందించటానికి భారత్ సిద్దంగా ఉంది’ అని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా మోడీ ‘మన రైతులు ప్రపంచానికి ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తున్నారని’ అని కూడా ప్రధాని అన్నారు.
కాగా..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (ఏప్రిల్ 12,2022) వర్చువల్ సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఈ సమావేశంలో యుక్రెయిన్ పై రష్యా యుద్ధం అంశంతో పాటు ప్రపంచ ఆహార కొరతపై కూడా చర్చలు జరిగాయి.

ఈ సమావేశం గురించి ప్రధాని మాట్లాడుతూ..‘ప్రపంచదేశాలు ఆహార సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని బైడెన్ తో పేర్కొన్నానని.. చమురు, ఎరువులు సమకూర్చుకోవడం సమస్యాత్మకంగా మారిందని వివరించినట్టు తెలిపారు. ఆహార సమస్య కొత్తగా కలవరపాటుకు గురిచేస్తోందని అన్నారు.

Also read : Modi – Joe Biden: నేడు మోదీ, జో బైడన్ కీలక భేటీ.. ఉక్రెయిన్‌ అంశంపైనే ప్రధాన చర్చ?

అయితే, ప్రపంచదేశాలకు ఆహారాన్ని అందించే సామర్థ్యం భారత్ కు ఉందని తెలిపారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) (World Trade Organisation)అనుమతిస్తే రేపటి నుంచే ఆహారం అందిస్తామని..దాని కోసం భారత్ సిద్ధంగా ఉందని..తెలిపారు. భారతదేశ ప్రజలకు సరిపోయేంత ఆహారం అందుబాటులో ఇప్పటికే ఉందని, అదే సమయంలో ప్రపంచదేశాల కడుపు నింపేంత ఆహారం కూడా తమ వద్ద ఉందని ప్రధాని మోడీ వివరించారు. భారత రైతులు చాలా గొప్పవారు. అందుకే పంటను విస్తారంగా పండించారు. నిల్వలు చేసుకునేంతగా పండించారని తెలిపారు. ప్రపంచానికి ఆహారాన్ని అందించటానికి భారత రైతులు సన్నద్ధంగా ఉన్నారని మోడీ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ చట్టాలను పాటించాల్సి ఉందని, దీనిపై డబ్ల్యూటీఓ ఎప్పుడు అనుమతిస్తుందో తెలియదని పేర్కొన్నారు. గుజరాత్ లోని శ్రీ అన్నపూర్ణ ధామ్ ట్రస్ట్ ఏర్పాటు నేపథ్యంలో జరిగిన కార్యక్రమంలో మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచదేశాలు ఆహార కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందన్న తమ ఆలోచన పట్ల బైడెన్ కూడా ఏకీభవించారని మోడీ తెలిపారు.

India-China: చైనా సహాయం తీసుకుంటే ఇక అంతే సంగతులు: భారత విదేశాంగ మంత్రి హెచ్చరిక

కాగా..రష్యా,యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఆహార నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రపంచం ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని ఆహార నిల్వలు ఖాళీ అవుతాయి. ఈ విషయాన్ని నేను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడానని తెలిపారు మోడీ. WTO అనుమతి ఇస్తే, రేపటి నుండి ప్రపంచానికి ఆహార నిల్వలను సరఫరా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని నేను సూచించాను, ”అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు