PM Modi visit Bhopal : ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పర్యటించనున్నారు. జన జాతీయ గౌరవ దివాస్ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భోపాల్లోని జంబూరీ మైదానంలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం దేశంలో మొట్టమొదటిసారి ప్రభుత్వ- ప్రయివేట్ భాగస్వామ్యంతో నిర్మించిన హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ను జాతికి అంకితం చేయనున్నారు.
హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ను పునరుద్ధరించి ప్రపంచ ప్రమాణాల స్థాయికి మెరుగుపరిచారు. అంతేకాక ఆ స్టేషన్కు గోండ్ రాణి కమలాపతి రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. ఈ కొత్త రైల్వే స్టేషన్లో విమానాశ్రయంలో ఉండేంటటువంటి మెరుగైన వసతులు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు 4వందల 50 కోట్లు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ కింద మూడేళ్లలో ఖర్చు చేశారు. వికలాంగులు సైతం సులభంగా వెళ్లగలిగేలా సదుపాయాలు ఏర్పాటుచేశారు.
Governor Tamilsai : గవర్నర్ తమిళిసై ఆదిలాబాద్ పర్యటన
ప్రధాని పర్యటన సహా వేడుకల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. మొత్తం 23 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. నాలుగు గంటల పాటు ప్రధాని భోపాల్లో గడపడనుండగా.. మైదానంలోని వేదికపై గంటా పదిహేను నిమిషాలు ఉండనున్నారు. వేదికపై ఐదు డోమ్లను ఏర్పాటుచేశారు. గిరిజనుల కోసం భారీ వేదికలను నిర్మించారు. ఇందు కోసం 3వందల మంది వారం రోజులకుపైగా శ్రమిస్తున్నారు.