Bus Accident
Bus Accident : కర్ణాటక రాష్ట్రంలో పండుగ వేళ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులోని 17మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుంది. హెబ్బులి హైవేపై హిరియార్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, అధికారులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు పచేపట్టారు.
లారీ ఢీ కొట్టినే తరువాత బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలుకాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire #chitradurga #karnataka pic.twitter.com/Fdpe5Tg999
— Naik Kartik (@mekartiknaik) December 24, 2025