Rahul Gandhi : సరిహద్దుల్లో జరుగుతున్నదేంటి మరి..మోదీ పర్యటనలో భద్రతా లోపంపై రాహుల్
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
- venkaiahnaidu
- Published On : January 7, 2022 / 06:14 PM IST
Rahul
Rahul Gandhi : బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ విషయమై ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ శుక్రవారం ఓ ట్వీట్ లో..మన సరిహద్దుల్లో ప్రస్తుతం జరుగుతున్నది దేశ భద్రత యొక్క అతిపెద్ద లోపం అని పేర్కొన్నారు. ప్రధాని దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా రాహుల్ అని ప్రశ్నించారు. పాంగాంగ్ త్సో,చైనా హ్యాష్ ట్యాగ్ లను రాహుల్ ట్వీట్ లో పెట్టారు. దీనిని బట్టి పాంగాంగ్ సరస్సుపై చైనా అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జిని పరోక్షంగా రాహుల్ ప్రస్తావించినట్లు అర్థమవుతోంది.
ALSO READ President’s Rule : పంజాబ్ లో రాష్ట్రపతి పాలన!
ALSO READ Pangong Lake : భారత్ దెబ్బకు భయపడి..పాంగాంగ్ సరస్సుపై బ్రిడ్జి నిర్మిస్తోన్న చైనా
