Rahul Gandhi: కిటికీలు, తలుపులు చేసే పనుల్లో మమేకమైన రాహుల్ గాంధీ
కాంగ్రెస్కు పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి పనుల్లో పాలుపంచుకుంటున్నారు.
- T Venkateshwarlu
- Published On : September 28, 2023 / 07:24 PM IST
Rahul Gandhi
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల్లో మమేకమై కూలీ పనుల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ఇటీవలే ఆయన రైల్వే స్టేషన్లో హమాలీగా కనపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలోని ఫర్నీచర్ మార్కెట్ కృతి నగర్ లో ఆయన కార్పెంటర్ పనిచేశారు. కాసేపు కిటికీలు, తలుపులు చేసే పనుల్లో మమేకం అయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. కార్పెంటర్లు కష్టపడి పనిచేసే వారు మాత్రమే కాదని గొప్ప కళాకారులు కూడా అని రాహుల్ గాంధీ చెప్పారు. తాను వారి నుంచి స్కిల్స్ నేర్చుకున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
కాగా, మరికొన్ని నెలల్లో దేశంలో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు మరింత దగ్గర కావాలని ప్రణాళికలు వేసుకున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి విడత పూర్తయింది. ఆ యాత్రతో రాహుల్ కాంగ్రెస్ పార్టీ వైపునకు దేశం దృష్టి తిరిగేలా చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
बढ़ते चलो… pic.twitter.com/6NwXLd9wJq
— Congress (@INCIndia) September 28, 2023
दिल्ली के कीर्तिनगर स्थित एशिया के सबसे बड़े फर्नीचर मार्केट पहुंचे जननायक @RahulGandhi जी।
वहां उन्होंने बढ़ई भाइयों से मुलाकात कर उनकी समस्याएं सुनीं और उनके हुनर को करीब से जानने और समझने की कोशिश की।
‘भारत जोड़ो यात्रा’ जारी है… pic.twitter.com/Pxzn3GZzBP
— Congress (@INCIndia) September 28, 2023
