Ravishankar Prasad
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (64) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన ఎయిమ్స్ లో చేరారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (64) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన ఎయిమ్స్ లో చేరారు. ఆస్పత్రిలోని పల్మనరీ మెడిసిన్ విభాగంలో రవిశంకర్ ను ఉంచినట్టు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. గతకొంతకాలంగా ఆయన శ్వాస కోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
సోమవారం శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ప్రసాద్ ను హుటాహుటినా ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నట్టు ఎయిమ్స్ సీనియర్ వైద్యులు ఒకరు వెల్లడించారు.