Russia ukraine war : యుక్రెయిన్ నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సాదరంగా స్వాగతం పలికారు. యుద్ధ వాతావరణం నుంచి క్షేమంగా తమవారిని చేరుకుంటున్నామని ఆనందంలో ఉన్న విద్యార్ధులకు మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరుదైన స్వాగతం పలికారు. ఆపరేషన గంగ ద్వారా యుక్రెయిన్ లో ఉన్న విద్యార్ధులకు భారత్ విమానాల్లో తలిస్తున్న క్రమంలో ఢిల్లీకి వేలాదిమంది విద్యార్థు భారత్ చేరుకుంటున్నారు. అలా వచ్చినవారికి మంత్రి అరుదైన స్వాగతం పలికారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటినుంచి యుక్రెయిన్ లో ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటు భారత్ రావాలని ఉన్నా ఎటువంటి దారి లేకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. ఈక్రమంలో భారత్ ఆపరేషన్ గంగ పేరుతో పలు విమానాలను యుక్రెయిన్ దేశ సరిహద్దుల్లోంచి విద్యార్ధులను తలిస్తోంది. ఏడు రోజులుగా యుక్రెయిన్ లో ఏమాత్రం యుద్ధ వాతావరణం శాంతించటంలేదు.
యుద్ధం కారణంగా భీతావహ పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్లో చిక్కుబడిపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ గంగ నాన్ స్టాప్గా కొనసాగుతోంది. ఇప్పటికే వేల మంది భారతీయులను ఈ ఆపరేషన్ స్వదేశానికి చేర్చింది. ఇందులో భాగంగా బుధవారం ఉక్రెయిన్లోని భారతీయులతో ఢిల్లీలో ల్యాండైన్ విమానానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్వాగతం చెప్పారు.
బుధవారం (మార్చి 2,2022)యుక్రెయిన్ నుంచి బయలుదేరి ఢిల్లీలో ల్యాండైన ఇండిగో విమానంలో సామాన్య పౌరుల కంటే విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వీరంతా క్షేమంగా దేశానికి తిరిగివచ్చిన సందర్భంగా వారికి వినూత్నంగా స్వాగతం పలకాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భావించారు. విమానం ల్యాండవగానే..అందులోకి ఎక్కిన స్మృతి ఇరానీ.. స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చిన మీకందరికీ స్వాగతం అంటూ స్మృతి తెలిపారు.
ఒక్క భాషలోనే కాకుండా ఏకంగా నాలుగు భాషల్లో స్మృతి విద్యార్థులకు స్వాగతం పలికారు. స్మృతి ఇరానీ ఏమాత్రం తడబాటు లేకుండా నాలుగు భాషల్లో స్వాగతం చెప్పడంపై విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.తరువాత ఆనందం వ్యక్తంచేశారు.
#WATCH | Union Minister Smriti Irani welcomes Indians back home by speaking in regional languages on their return from war-torn #Ukraine pic.twitter.com/ZlfW39w6in
— ANI (@ANI) March 2, 2022