సరికొత్త ఆవిష్కరణ : కృత్రిమ మానవులు

  • Publish Date - January 8, 2020 / 09:13 AM IST

అచ్చం మనష్లుల్లానే మాట్లాడుతాయి..సాటి వారిపై సానుభూతి కూడా చూపిస్తాయి. కానీ మనుషులు కాదు..వారే కృతిమ మానవులు. అవును నిజం. టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. అందులో భాగంగా కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చేస్తున్నాయి. శామ్ సంగ్ ల్యాబ్స్ నియాన్ పేరిట కొత్తది సృష్టించింది.

 

అచ్చం మనుషుల్లాగే మాట్లాడగలిగే ఉన్న ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ డిజిటల్ రూపాలు మాట్లాడుతాయని కంపెనీ వెల్లడించింది. నియాన్లు మన ఫ్రెండ్స్ అని, అంతేగాకుండా సహచరులని వ్యాఖ్యానించారు. ల్యాబ్స్ ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ప్రణవ్ మిస్త్రీ. 

లాస్ వెగాస్‌లో 2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో ప్రారంభమైంది. ఈ సందర్భంగా శామ్ సంగ్ యూనిట్ స్టార్ ల్యాబ్స్‌లో ఉత్పత్తి చేసిన నియాన్ వివరాలను కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. పరస్పర చర్యల వల్ల జ్ఞాపకాలు ఏర్పడడమే కాకుండా పదిలంగా ఉంటాయని,  న్యూరల్ నెట్ వర్క్‌లు, కంప్యూటేషనల్ రియాల్టీతో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో నియాన్లను సృష్టించడం జరిగిందని తెలిపారు. 

 

ఇదిలా ఉంటే..దీనిపై కొందరు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. నియాన్‌లో చెప్పుకోదగిన రహస్యం ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అంతర్లీనంగా వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏఐతో రూపొందిన ఒక డిజిటల్ అవతారమంటున్నారు. ఇప్పటికే ఉన్న కృతిమ మనిషిరి ‘సిరి’లాగే ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Read More : యుద్ధ మేఘాలు : పెట్రోల్ దాచుకోవాల్సిందేనా!