GVLపై చెప్పు దాడి : కాంగ్రెస్ పనే అంటున్నBJP

బీజేపీ రాజ్యసభ సభ్యుడు, AP బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు దాడి కలకలం రేపుతోంది.

  • Publish Date - April 18, 2019 / 08:50 AM IST

బీజేపీ రాజ్యసభ సభ్యుడు, AP బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు దాడి కలకలం రేపుతోంది.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు, AP బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు దాడి కలకలం రేపుతోంది. ఏప్రిల్ 18వ తేదీ గురువారం ఢిల్లీలో GVL ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి చేసింది కాంగ్రెస్ పార్టీయే అంటూ GVL వెల్లడించారు. దాడి జరిగిన అనంతరం ప్రెస్ మీట్ కొనసాగించిన ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ నీతిమాలిన చర్యలకు దిగుతోందని తెలిపారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు జీవీఎల్. 
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

ఇదిలా ఉంటే జీవీఎల్‌పై దాడి చేసిన వ్యక్తి డాక్టర్ శక్తి భార్గవగా గుర్తించారు. ఇతను కాన్పూర్‌కు చెందిన వాడు. ఘటన జరిగిన అనంతరం పార్టీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బీజేపీ పార్టీ ఆఫీసులో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో ఇతను ఎలా ఎంట్రీ ఇచ్చాడు ? ఎవరైనా సహకరించారా ?  ఇతను ఎలా వచ్చాడనేది దానిపై పోలీసులు విచారిస్తున్నారు. భార్గవ అద్వానీకి వీరాభిమాని అని ప్రచారం జరుగుతోంది. 

ట్రెండింగ్ వార్తలు