Sonia Gandhi meets Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన సోనియాగాంధీ రాష్ట్రపతి ముర్ముతో మంగళవారం (ఆగస్టు 23,2022) భేటీ అయ్యారు. ఈ విషయాన్యని రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రాష్ట్రపతితో సోనియాగాంధీ సమావేశమయ్యారని తెలిపింది. ముర్ము అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యాక సోనియా గాంధీ ఆమెను కలవటం ఇదే మొదటిసారి.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకుతున్న వేళ రాష్ట్రపతిని సోనియా కలవటం ఆసక్తికరంగా మారింది. ముర్ము దేశంలో రెండవ మహిళా ప్రెసిడెంట్ కావటమే కాక..మొదటి గిరిజన అధ్యక్షురాలు కావటం విశేషం. ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో ఆమె అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది.ఈక్రమంలో సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసారు.