Supreme Court: పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎంత.. బిల్లులపై వివరాలు ఉండాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
పెట్రోల్ బంకు ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో ప్రదర్శించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సుప్రీం కోర్టు(Supreme Court) నిరాకరించింది.
- V Santhosh Kumar
- Published on- August 31, 2026 / 04:13 PM IST
Supreme court refuses pil seeking mandatory display of ethanol percentage
- ఇథనాల్ శాతం వెల్లడించాలంటూ పిటిషన్
- సుప్రీంకోర్టు వ్యాజ్యం స్వీకరించలేదు
- హైకోర్టును ఆశ్రయించాలని సూచన
Supreme Court: పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో తప్పనిసరిగా ప్రదర్శించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) స్వీకరించేందుకు సుప్రీం కోర్టు(Supreme Court) నిరాకరించింది. అయితే, వినియోగదారుల పారదర్శకతకు సంబంధించిన ఈ అంశంపై పిటిషనర్ సంబంధిత హైకోర్టును కానీ, సమర్థిక అధికారాన్ని కానీ ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. అడ్వొకేట్ నరేంద్ర కుమార్ గోస్వామి దాఖలు చేసిన ఈ పిటిషన్, వినియోగదారులకు ఇంధనంపై ఉన్న హక్కులను ప్రధానంగా ప్రస్తావించింది.
Delhi Gangrape: మరో నిర్భయ తరహా ఘటన.. కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం.. ఢిల్లీలో ఘోరం
పిటిషనర్ డిమాండ్లు – వినియోగదారుల హక్కులు:
పెట్రోల్ బంకుల్లోని డిస్పెన్సింగ్ నాజిల్స్పై, కస్టమర్లకు ఇచ్చే రసీదులపై ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా ముద్రించాలని పిటిషనర్ కోరారు. తాము కొనుగోలు చేస్తున్న ఇంధనం నాణ్యత, అందులోని మిశ్రమాల వివరాలు తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని వాదించారు. ఈ పిటిషన్ ప్రభుత్వ ఈ20 (E20) విధానానికి వ్యతిరేకం కాదని, కేవలం పారదర్శకత పెంచడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
ఈ20 పెట్రోల్ విధానం – వాహనదారుల ఆందోళన:
ప్రస్తుతం అమలులో ఉన్న ఈ20 పెట్రోల్లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటాయి. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్య ఉద్గారాలను నియంత్రించడం, బయోఫ్యూయల్స్ వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం లక్ష్యం. అయితే, పాత వాహన ఇంజిన్లు అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలంగా లేకపోవడంతో వాహనదారుల్లో కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
