రౌడీ ఇన్స్‌పెక్టర్ : నడిరోడ్డుపై వెంటాడి.. వేటాడి కొట్టాడు

  • Publish Date - February 27, 2019 / 05:15 AM IST

తమిళనాడులో ఓ ఇన్స్‌పెక్టర్ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై చావబాదిన దృశ్యాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పోలీసే కొడుతుండడంతో ఎవరూ దీనిని అడ్డుకోలేకపోయారు. ఈ ఘటన నాగపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. 

నాగపట్నంలోని ఓ గ్రామంలో ఇద్దరు సోదరులు జాన్సన్, ఛార్లెస్ మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఛార్లెస్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  ఫిర్యాదు చేస్తావా అంటూ జాన్సన్ మరోసారి గొడవకు దిగాడు. ఇన్స్ పెక్టర్ తన సిబ్బందితో అతని ఇంటికి వచ్చాడు. గేటు తీయకపోవడంతో బలంగా దానిని తన్ని లోనికి వెళ్లాడు. కొద్దిసేపు అనంతరం అతడిని రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. ఇద్దరు సిబ్బంది అతని చేతులను గట్టిగా అదిమి పట్టుకున్నారు. పెద్ద దుడ్రుకర్ర పట్టుకున్న ఇన్స్‌పెక్టర్ చితకబాదాడు. దెబ్బలకు తాళలేక మొత్తుకుంటున్నా సదరు ఇన్స్‌పెక్టర్ కరుణించలేదు. ఈ దాడిని గ్రామస్తులు ఎవరూ అడ్డుకోలేదు.
Also Read: లిక్కర్ కు ఆధార్ లింక్ చేద్దామా! : కార్డు చూపించి బాటిల్ తీసుకోండి

కొంతమంది ఈ దశ్యాలను సెల్ ఫోన్‌లో బంధించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పోలీసులు దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. గ్రామంలోకి వెళ్లిన సమయంలో తనపట్ల జాన్సన్ దురుసుగా ప్రవర్తించాడని, అందువల్లే తాను ఇలా చేయాల్సి వచ్చిందని సదరు ఇన్ స్పెక్టర్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. చిన్న తప్పిదానికి అత్యంత అమానుషంగా చితకబాదడం ఏంటీ అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఇన్స్‌పెక్టర్‌పై చర్యలుంటాయని తెలుస్తోంది. 
Also Read: Surgical Strikes 2.0 : హైదరాబాద్ అప్రమత్తం

ట్రెండింగ్ వార్తలు