Pf Rate
Central Government : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. కేంద్రం పీఎఫ్ పై వడ్డీ రేటు తగ్గించింది. పీఎఫ్ పై వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. పీఎఫ్ వడ్డీరేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత వడ్డీరేటును 8.1 శాతానికి పరిమితం చేస్తున్నట్టు శుక్రవారం సాయంత్రం నోటిఫై చేసింది. తగ్గించిన వడ్డీరేటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి వర్తించనుంది. అంతకు ముందు ఏడాది ఈ వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది.
ఇప్పటికే బ్యాంకుల్లో వడ్డీరేట్లు తక్కువగా ఉండగా ఆఖరికి కేంద్రం కూడా వడ్డీ రేట్లు తగ్గించడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. గత నలభై ఏళ్లలో కూడా ఇదే అత్యల్ప వడ్డీరేటు. చివరి సారిగా 1977-78లో పీఎఫ్ వడ్డీరేటు 8 శాతంగా ఉండేది. 44 ఏళ్ల తర్వాత ఇంచుమించు అదే స్థాయికి వడ్డీరేటు పెరిగింది.
New PF Rule : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయకపోతే నష్టపోతారు
ఈ నలభై ఏళ్లలో రూపాయి విలువ గణనీయంగా క్షీణించింది. అన్నింటి ధరలు పెరిగాయి. ఇలాంటి సందర్భాల్లో కనీసం ప్రభుత్వాలపై తమ నుంచి తీసుకున్న సొమ్ముకు మంచి వడ్డీ ఇవ్వాల్సి ఉండగా దాన్ని విస్మరించి వడ్డీకి కోత పెట్టడం పట్ల ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు.