Union Cabinet Decisions (Photo : Google)
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బిహార్లో గంగానదిపై 4.55 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.3,064.45 కోట్లతో 6 వరుసలుగా హై లెవెల్ ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిగా-సోనేపూర్ రైల్ కం రోడ్ బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు.
త్రిపురలో ఖొవాయి-హరీనా మధ్య 135 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొబ్బరికి కనీస మద్దతు ధర నిర్ణయించింది కేంద్రం. 2024 సీజన్కు ఎండు కొబ్బరి క్వింటాల్ ధర రూ. 11,160.. ఎండుకొబ్బరి (కురిడీ)కి రూ. 12వేలు ధర నిర్ణయించారు.