West Bengal : కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనానికి విద్యుదాఘాతం..10 మంది మృతి..

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో ఆదివారం అర్ధరాత్రి అత్యంత విషాదం సంభవించింది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కులో విద్యుదాఘాతానికి గురి అయ్యింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

10 kanwariyas dead due to electrocution in Bengal : పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో ఆదివారం (7,2022) అర్ధరాత్రి అత్యంత విషాదం సంభవించింది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కులో విద్యుదాఘాతానికి గురి అయ్యింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో అత్యంత గా, తీవ్రంగా గాయపడిన 16 మందిని మరింత మెరుగైన చికిత్స కోసం జల్పాయ్‌గురి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వాహనంలో ఏర్పాటు చేసిన డీజీ సిస్టం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ వల్లే ఈ విద్యుదాఘాతం సంభవించింది అని పోలీసులు నిర్ధారించారు.

మేఖ్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్లా బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది అని మఠభంగ అడిషనల్ ఎస్పీ అమిత్ వర్మ వెల్లడించారు. జనరేటర్ వైరింగ్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందని కానీ మరింతగా విచారణ చేస్తున్నామని తెలిపారు. కన్వారియాలందరూ శీతల్‌కుచి పోలీస్ పరిధిలోని ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని..వాహనాన్ని సీజ్ చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకుని మరింత క్షణ్ణంగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

కాగా గత జులైలో కూడా కన్వర్ భక్తులు ప్రమాదానికి గురి అయి ఆరుగురు మరణించారు. యూపీలోని సదాబాద్ పీఎస్ పరిధిలోని బదర్ గ్రామంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కన్వర్ భక్తులపై ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు భక్తులు మరణించారు.

 

ట్రెండింగ్ వార్తలు