యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్తోపాటు ఇతరులకు చెందిన రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసు కింద వీటిని స్వాధీనం పరుచుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కపూర్తోపాటు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్, ధీరజ్ వాధవాన్లకు చెందిన ఆస్తులను ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) కింద జప్తు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
Read Here>>Indiaలో తయారైన Samsung గెలాక్సీ స్మార్ట్వాచ్లు