Kerala : కేరళలో యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. వరకట్న డిమాండ్లను తీర్చలేకపోయినందుకు వరుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Social Media : సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్త.. మైనర్ బాలికపై లైంగిక దాడి, ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్
కేరళ తిరువనంతపురానికి చెందిన డాక్టర్ షహానా ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్జరీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుకేషన్ కోర్సు చదువుకుంటోంది. గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్న ఆమె తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయాడు. షహానా తల్లి, ఇద్దరు తోబుట్టువులతో ఉంటోంది. డాక్టర్ అయిన EA రువైస్ అనే వ్యక్తితో షహానా కొంతకాలంగా సహజీవనంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే రువైస్ కుటుంబం వరకట్నంగా 150 గ్రాముల బంగారం, 15 ఎకరాల భూమి, BMW కారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వారి డిమాండ్లను షహానా కుటుంబం తీర్చలేమని చెప్పడంతో రువైస్ కుటుంబం పెళ్లి రద్దు చేసుకుంది. దీంతో షహానా తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని స్ధానికులు ఆరోపిస్తున్నారు.
Thailand : చెట్టును ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. 14మంది దుర్మరణం
కాగా షహానా నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్లో ‘అందరికీ డబ్బు కావాలి’ అని షహానా రాసినట్లుగా సూసైడ్ నోట్ దొరికినట్లు తెలుస్తోంది. షహానా మృతిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. షహానా ప్రియుడు రువైస్పై పలు సెక్షన్ల క్రింత పోలీసులు కేసు నమోదు చేశారు.