Chandrababu Naidu Varanasi Tour : మోదీ పుట్టినరోజు సందర్భంగా వారణాసిలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఆలయంలో పూజలు.. ర్యాలీ ఫొటోలు వైరల్
Chandrababu Naidu Varanasi Tour : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన ‘వారణాసి-వడ్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడి నుంచి గుజరాత్లోని మోదీ జన్మస్థలమైన వడ్నగర్కు సేవా సంకల్ప్ బైక్ ర్యాలీని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌధరీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్తో కలిసి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతకు ముందు చంద్రబాబు కాశీవిశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో శివలింగాలకు అర్చన, అభిషేకం చేశారు. పూజల అనంతరం యోగి ఆదిత్యనాథ్, అర్చకులు.. చంద్రబాబు మెడలో రుద్రాక్ష మాల వేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
- Harish Thanniru
- Published on- September 18, 2026 / 07:59 AM IST
