బంగారం, వెండి ధరల్లో ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రికార్డు స్థాయిలో వాటి ధరలు పెరిగాయి.
2/7
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 3,220పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 2,950 పెరిగింది. అంతర్జాతీయ మార్కెల్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 174 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 5, 256 డాలర్ల వద్ద కొనసాుతుంది.
3/7
వెండి ధర కూడా భారీగా పెరిగింది. సోమవారం కిలో వెండిపై రూ. 10వేలు పెరగ్గా.. మంగళవారం రూ.12వేలు.. తాజాగా బుధవారం 13వేలు పెరిగింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,51,400 వద్ద కొనసాగుతుండగా.. 24క్యారట్ల ధర రూ.1,65,170 వద్ద కొనసాగుతుంది.
5/7
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,51,550కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,65,300కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,51,400కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,65,170కు చేరింది.
6/7
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.4,00,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 4,00,000 వద్దకు చేరింది.
7/7
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.