IND vs AUS 1st Test Match: రెండోరోజూ భారత్దే హవా.. భారత్ వర్సెస్ ఆసీస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ఫొటోలు
IND vs AUS 1st Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో తొలి టెస్టు మ్యాచ్లో ఆసీస్పై భారత్ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీంఇండియా 114 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆటతీరుతో సెంచరీ చేశాడు. 212 బంతుల్లో 120 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా (60), అక్షర్ పటేల్ (50) ఆఫ్ సెంచరీలు పూర్తిచేసుకొని క్రీజ్లో ఉన్నారు. మొత్తానికి రెండోరోజు ఆటలోనూ భారత్ హవా కొనసాగింది. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ ఐదు వికెట్లు తీశాడు.