Andhrapradesh : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన కనిపించింది. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాంబర్ కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కొద్దిసేపు పలు సమస్యలపై వీరు చర్చించారు.
2/8
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు కూడా భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జనసేన పార్టీకి సంబంధించిన పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
3/8
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను తన చాంబర్కు వెళ్లి కలిసిన నాగబాబు.. తమ్ముడు భుజంపై చేయివేసి ఫొటో దిగారు.
4/8
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఎమ్మెల్యే ఎం. అశోక్ రెడ్డి కలిశారు.
5/8
అదేవిధంగా బుధవారం శాసనసభలోని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీలో ఆయన్ను పలువురు మంత్రులు కలిశారు. వీరిలో మంత్రి నారా లోకేశ్, పయ్యావుల కేశవులు, నాదెండ్ల మనోహర్ తదితరులు కలిశారు.