Anna Konidela : మొదటిసారి పిఠాపురానికి పవన్ కళ్యాణ్ భార్య.. ట్రైన్లో వెళ్లి పూజలు చేసి.. అన్నా కొణిదెల ఫొటోలు వైరల్..
పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల మొదటిసారి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లి పిఠాపురంలో అమ్మవారి శక్తి పీఠం, దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు నిర్వహించారు. అన్నా కొణిదెల ట్రైన్ లో వెళ్లి పిఠాపురంలోని ఆలయాల సందర్శన ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ భార్య మొదటిసారి పిఠాపురం వెళ్లడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- August 14, 2026 / 10:52 PM IST
Anna Konidela
