Home » Photo-gallery » Pm Modi Visited Kaziranga National Park In Assam
PM Modi : అభయారణ్యంలో ఏనుగుపై మోదీ సఫారీ.. జంతువుల చిత్రాలను కెమెరాలో బంధించిన పీఎం.. ఫొటోలు వైరల్
PM Modi visited Kaziranga National Park : ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ ను సందర్శించారు. పార్కులో ఏనుగు పైకెక్కి సఫారీ చేశారు. ఏనుగు పైనుంచే పార్కులోని ప్రకృతి అందాలు, జంతువుల చిత్రాలను కెమెరాలో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు.