రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ –2022 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం జగన్ మోహణ్ రెడ్డి, విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన 35మందికి (30 సంస్థలకు) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ కలిసి అవార్డులు ప్రధానం చేశారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం, మహిళా శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్ధలకు 20 వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 10 వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు అందజేశారు.