FIR on Himanta Biswa Sarma: సోనియా గాంధీపై విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ అస్సాం సీఎంపై కేసు నమోదు
అల్లర్లు, దహనాలను ప్రేరేపించడానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా పేర్కొంటూ.. హిమంత బిస్వా శర్మపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 115/436 కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచారం అయిందని, అస్సాంలో కూడా అందుబాటులో ఉందని దేబబ్రత సైకియా తెలిపారు.
- tony bekkal
- Updated on- September 21, 2023 / 06:18 PM IST
Himanta Remarks on Sonia: కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే దేబబ్రత సైకియా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. తూర్పు అస్సాంలోని శివసాగర్ జిల్లాలోని నజీరా మోడల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. సోనియా గాంధీ సహా ఆమె కుటుంబంపై ముఖ్యమంత్రి హిమంత శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దేబబ్రత సైకియా ఆరోపించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సెప్టెంబర్ 19న మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పారు. విదిషా జిల్లాలో బీజేపీ జన్ ఆశీర్వాద్ ర్యాలీలో ఆయన అవమానకరమైన, ద్వేషపూరిత పదాలను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
126 మంది సభ్యుల అసెంబ్లీలో దేబబ్రత సైకియా ప్రతిపక్ష నేత కూడా. మాజీ సీఎం కమల్నాథ్ హిందువుపై సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశ్నలు సంధించారని ఆయన తన ఫిర్యాదులో రాశారు. అనంతరం, కమల్ నాథ్ హిందువు అయితే గాంధీ కుటుంబాన్ని రామ మందిరానికి తీసుకెళ్లాలని ఆయన హేళన చేశారు. 10 జన్పథ్ను తగలబెట్టడం గురించి శర్మ మాట్లాడారని సైకియా ఆరోపించారు. శర్మ బహిరంగంగా హింస, దహనాలను ప్రేరేపించారని పేర్కొన్నారు. 10 జనపథ్ నివాసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదని, మరి ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన భార్య సోనియా గాంధీ నివాసంగా ఉందని అవమానకరంగా వ్యాఖ్యానించారని ఫిర్యాదులో దేబబ్రత పేర్కొన్నారు.
Nuclear Weapon: అణు బాంబులు తయారు చేస్తామంటూ బాంబ్ పేల్చిన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్
రాజ్యాంగ పదవిని కలిగి ఉన్న హిమంత బిస్వా శర్మ ఇటువంటి అనియంత్రిత ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపించేలా ఉండడం వల్ల.. 10 జన్పథ్లోని నివాసితులకు హాని కలిగే అవకాశం ఉందని అన్నారు. అల్లర్లు, దహనాలను ప్రేరేపించడానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా పేర్కొంటూ.. హిమంత బిస్వా శర్మపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 115/436 కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచారం అయిందని, అస్సాంలో కూడా అందుబాటులో ఉందని దేబబ్రత సైకియా తెలిపారు.
