Rajasthan Politics: భారత్ మాతాకి జై అంటుండగా ఆపి కాంగ్రెస్ జిందాబాద్ అనిపించిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ పరిశీలకురాలు ఆరాధనా తివారీ మాట్లాడుతూ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమని, బదులుగా కాంగ్రెస్ జిందాబాద్ అనే నినాదాలు చేయమన్నారు. దీనికి ముందు కూడా, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలను బెదిరించారు
- tony bekkal
- Published On : September 5, 2023 / 07:09 PM IST
Anuradha Mishra: రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి వివాదాల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. జైపూర్లో జరిగిన పార్టీ సమావేశంలో రాష్ట్ర పార్టీ పరిశీలకురాలు ఆరాధన మిశ్రా వివాదాస్పద ప్రకటన చేశారు. సమావేశంలో ‘భారత్ మాతా’కు బదులు ‘కాంగ్రెస్ జిందాబాద్’ నినాదాలు చేయాలని మిశ్రా పార్టీ కార్యకర్తలను కోరారు. జైపూర్లో సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, వాగ్వాదం జరిగింది.
Sanatan Row: మరో అడుగు ముందుకు వేసిన అయోధ్య సాధువు.. ఉదయనిధి తల తానే నరికేస్తానంటూ ప్రకటన
వాగ్వాదం మధ్య కొందరు కార్యకర్తలు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. దీనిని కాంగ్రెస్ నాయకురాలు ఆరాధన అడ్డుకుని, ‘కాంగ్రెస్ జిందాబాద్’ అని నినాదాలు చేయాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలను నియంత్రించేందుకు మైక్ అందుకుని ఎవరైనా నినాదాలు చేస్తే క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తామన్నారు. ఆమె ప్రకటన తర్వాత కూడా కొందరు కార్యకర్తలు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలను కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయాలని మిశ్రా కోరారు.
Bharat Name Row: మన దేశానికి గతంలో అనేక పేర్లు.. అయితే భారత్ అనే పేరు ఎలా వచ్చింది?
అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ పరిశీలకురాలు ఆరాధనా తివారీ మాట్లాడుతూ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమని, బదులుగా కాంగ్రెస్ జిందాబాద్ అనే నినాదాలు చేయమన్నారు. దీనికి ముందు కూడా, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలను బెదిరించారు. సోనియా జీ కీ జై అని నినాదాలు చేయించారు. దేశం కంటే వారికి పార్టీ, కుటుంబమే ఎక్కువ’’ అని అన్నారు.
