Congress Third List : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి 5 స్థానాలు ఖరారు

ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డిని చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది.

Congress Third List : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మూడో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. 7 రాష్ట్రాల నుంచి 57మంది అభ్యర్థులతో లిస్ట్ రిలీజ్ చేసింది ఏఐసీసీ. ఇందులో తెలంగాణ నుంచి ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిని అభ్యర్థులుగా ప్రకటించింది కాంగ్రెస్. ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డిని చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల విషయానికి వస్తే.. తొలి జాబితాలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. మూడో లిస్టులో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముందు నుంచి చర్చలో ఉన్న పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. తొలి విడతలో 4 స్థానాలకు, ఇప్పుడు 5 స్థానాలకు.. మొత్తంగా రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

ఇప్పటివరకు కాంగ్రెస్ హైకమాండ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మూడు జాబితాలు విడుదల చేసినప్పటికీ.. రెండో జాబితాలో తెలంగాణకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయలేదు. తాజాగా మూడో లిస్టులో తెలంగాణ నుంచి 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే.. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్, భువనగిరి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని వాటికి అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది.

Also Read : ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు.. సీఎం రేవంత్‌పై సీనియర్లు సీరియస్

 

 

ట్రెండింగ్ వార్తలు