పీవీపీ వివాదాస్పద వ్యాఖ్యలు : స్పెషల్ స్టేటస్ బోరింగ్ సబ్జెక్ట్

ప్రత్యేకహోదా బోరింగ్ సబ్జెక్టు అంటూ పొట్లూరి వర ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.

  • Publish Date - March 21, 2019 / 06:54 AM IST

ప్రత్యేకహోదా బోరింగ్ సబ్జెక్టు అంటూ పొట్లూరి వర ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.

కృష్ణా : వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ లోక్ సభ అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పుడు సరికొత్త వివాదంలో ఇరుకున్నారు. ప్రత్యేకహోదా బోరింగ్ సబ్జెక్టు అంటూ చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. 

విజయవాడలో మార్చి 21 గురువారం కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ రాష్ట్ర విభాగం నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన పీవీపీ.. ప్రత్యేకహోదా అంశం ఓ బోరింగ్ సబ్జెక్ట్ అని…దానిపై తానేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇటీవలే పీవీపీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు.
Read Also : ఓట‌ర్ నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదా హాట్ టాపిక్ గా ఉంది. ఏపీ రాజకీయాలు దాని చుట్టే తిరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని..హోదా వస్తే అన్ని అయిపోవని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 

దాంతో కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటికి వచ్చి..ప్రత్యేక హోదా కోసం పోరాటం ప్రారంభించింది. ఇదే అంశంపై వైసీపీ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈనేపథ్యంలో ప్రత్యేకహోదా అంశం ఓ బోరింగ్ సబ్జెక్ట్ అని పీవీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.