Maharashtra Politics: ఆ పార్టీతో చేతులు కలిపి శరద్ పవార్కు చెక్ పెట్టేందుకు సిద్ధమైన ఉద్ధవ్ థాకరే
నియోజకవర్గ అనుసంధాన నాయకురాలు, స్థానిక ఉపనేత, జిల్లా సంపర్క్ ప్రముఖ్, స్థానిక మండల మహిళా సంఘం, జిల్లా ప్రముఖ్, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఉపాధి ప్రముఖ్, తాలూకా ప్రముఖ్, నగర ప్రముఖ్ ఏరియాల వారీగా జరిగే సమావేశంలో పాల్గొంటారు.
- tony bekkal
- Published On : August 15, 2023 / 07:30 PM IST
Sharad Pawar and Udhav Thackeray: అజిత్ పవార్, శరద్ పవార్ భేటీ మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద దుమారమే అయిపోయింది. వాస్తవానికి దీనిపై శరద్ పవార్ వర్గం తీవ్ర విమర్శల్ని ఎదుర్కుంటోంది. ఇక ఇదే సమయంలో పవార్ను దూరం పెట్టేందుకు ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ వర్గాలు సిద్ధమయ్యారనే వార్తలు గుప్పుమంటున్నాయి. శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ లేకుండానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు థాకరే వర్గం, కాంగ్రెస్లు సిద్ధమవుతున్నాయని విశ్వసనీయ సమాచారం. కాగా, లోక్సభ ఎన్నికల నేపథ్యాన్ని ఉద్ధవ్ థాకరే సమీక్షించనున్నారు.
Independence Day: ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోదీ చేసిన 10 ముఖ్యమైన ప్రకటనలు
అజిత్ పవార్, శరద్ పవార్ భేటీ మహావికాస్ అఘాడిలో గందరగోళం సృష్టించింది. లోక్సభ ఎన్నికలకు తమ తమ పార్టీల సన్నద్ధతపై కాంగ్రెస్, శివసేన (యూబీటీ) వర్గాలు బుధవారం నుంచి సమావేశాలు నిర్వహించనున్నాయి. థాకరే బృందం బుధవారం నుంచి 48 లోక్సభ స్థానాలను సమీక్షించనుంది. ఆగస్టు 16 నుంచి 19 మధ్య మొదటి దశలో మొత్తం 16 లోక్సభ నియోజకవర్గాలపై సమీక్ష జరగనుంది. ఎన్సీపీకి కంచుకోట అయిన బారామతి లోక్సభ నియోజకవర్గంపై థాకరే గ్రూపు మొదటి దశ సమావేశాల్లో సమీక్షించారు. ఇది ఆగస్టు 18న సమీక్షించబడుతుంది.
నియోజకవర్గ అనుసంధాన నాయకురాలు, స్థానిక ఉపనేత, జిల్లా సంపర్క్ ప్రముఖ్, స్థానిక మండల మహిళా సంఘం, జిల్లా ప్రముఖ్, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఉపాధి ప్రముఖ్, తాలూకా ప్రముఖ్, నగర ప్రముఖ్ ఏరియాల వారీగా జరిగే సమావేశంలో పాల్గొంటారు.
కాంగ్రెస్, శివసేనల ప్లాన్ బీ ఏంటంటే?
అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరిన తర్వాత కూడా శరద్ పవార్ పరిస్థితిపై స్పష్టత రాలేదు. శరద్ పవార్ రాబోయే కాలంలో స్పష్టమైన వైఖరిని తీసుకోకపోతే, ఎన్సీపీ లేకుండా పోరాడటానికి శివసేన (యూబీటీ), కాంగ్రెస్లు ప్లాన్ బీ సిద్ధం చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఉద్ధవ్ థాకరే, నానా పటోలే మధ్య సమావేశం జరిగినట్లు సమాచారం. ఇందులోభాగంగా శివసేన, కాంగ్రెస్లు అన్ని లోక్సభ నియోజకవర్గాల సమీక్షను ప్రారంభించాయి. ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి, షిరూర్ లోక్సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, కార్యాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరి పవార్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
