Maharashtra Politics: శరద్ పవార్ కూడా వస్తే అజిత్ పవార్ సీఎం అయిపోయినట్టే.. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఇదేనట
ఆగస్టు 12న పూణెలోని ఒక వ్యాపారవేత్త నివాసంలో ఇరు నేతల మధ్య రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు.
- tony bekkal
- Published On : August 16, 2023 / 03:42 PM IST
Pawar and Pawar: మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత విజయ్ వడ్డెటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక షరతుపై అజిత్ పవార్ను మహారాష్ట్ర సీఎం చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని అన్నారు. శరద్ పవార్ను వెంట తెచ్చుకున్నప్పుడే సీఎం అవుతారని ప్రధాని మోదీ అజిత్ పవార్కు చెప్పారని ఆయన అన్నారు. శరద్ పవార్, అజిత్ పవార్ భేటీ అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఇటీవల శరద్ పవార్ను అజిత్ పవార్ రహస్యంగా కలిశారు. అయితే ఏం చర్చించారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
INDIA Alliance: విపక్షాల కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? ఇండియా కూటమిలో నితీశ్ కుమార్ స్థానమేంటి?
కొల్హాపూర్లో విలేకరులతో అజిత్ పవార్ మాట్లాడుతూ ‘‘సమావేశం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పవార్ సాహెబ్ (శరద్ పవార్) ఇప్పటికే స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన భేటీకి మీడియా రకరకాల ప్రచారం ఇస్తూ గందరగోళం సృష్టిస్తోంది. సమావేశంలో అసాధారణంగా ఏదైనా జరిగిందని భావించాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ఆగస్టు 12న పూణెలోని ఒక వ్యాపారవేత్త నివాసంలో ఇరు నేతల మధ్య రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు.
