తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీకమాస శోభ

తెల్లవారుజామునే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.

కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీకమాస శోభ కనపడుతోంది. ఆలయాల్లో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. శివనామస్మరణతో శ్రీ బాల త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామి ఆలయం మార్మోగుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. మాసాలన్నింటిలో ఉత్తమైన మాసంగా కార్తీక మాసాన్ని చూస్తారు.

ఆధ్యాత్మికంగా దివ్యమైనది కార్తీక మాసం. ఈ మాసంలో శివ కేశవులను భక్తులు పూజిస్తారు. సూర్యోదయానికి ముందే బ్రహ్మ మూహుర్తంలో అభ్యంగన స్నానం చేస్తారు. కార్తీక మాసంలో వెలిగించే దీపం శుభకరమని భక్తులు నమ్ముతారు. ఈనెల 4వ తేదీన మొదటి కార్తీక సోమవారం ఉంటుంది. కార్తీక సోమవారాల్లో శివారాధన చేస్తే మనఃశాంతి కలుగుతుందని హిందువుల విశ్వాసం.

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి..!