Ayodhya Lord Ram : ధర్మానికి నిలువెత్తు రూపంగా నిలిచే శ్రీరామ చంద్రమూర్తి అయోధ్యలో కొలువుదీరారు. కోట్ల మంది భక్తుల మనసు పులకిస్తున్న వేళ, దేశమంతా రామనామ జపంతో తరిస్తుండగా.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, అంగరంగవైభవంగా పూర్తయింది. అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు 7వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరికి శ్రీరామ జన్మభూమి తీర్థం క్షేత్ర ట్రస్ట్ వారికి ప్రత్యేక కానుకలను అందించింది.
సోమవారం ప్రాణప్రతిష్ఠ తరువాత అతిథులు శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఇవాళ (మంగళవారం) నుంచి సామాన్య భక్తులందరూ బాలరాముడిని దర్శించుకొనేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం అర్థరాత్రి నుంచే మందిరం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే, రాముడిని దర్శించుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు. ఆన్ లైన్ లో కానీ, ప్రత్యక్షంగా ఆలయం వద్ద పాస్ లు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ బుకింగ్ ఇలా..
దర్శన సమయాలు..