దీపావళి: దీపం వెలిగించేప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి

  • Publish Date - October 24, 2019 / 07:50 AM IST

దీపావళికి దీపం వెలిగించటమంటే ప్రమిదలో ఒత్తి వేసి వెలిగించి టాపాసులు కాల్చుకోవడం మాత్రమే కాదు. దానికి కొన్ని నియమాలు.. నిబంధనలు కూడా ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో దీపానికి చాలా విశిష్టత ఉంది.

దేవాలయాల్లోను, ఇళ్లల్లోను పూజ చేసేప్పుడు దీపంతోపే పూజ ప్రారంభిస్తాం. ఇంట్లో ఎటువంటి శుభాకార్యాలు జరిగినా దీపాన్ని వెలిగించటం హిందూ సంప్రదాయంలో భాగం. అంటే దీపానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. దీపాలను గౌవరంతో, భక్తి శ్రద్ధలతో వెలిగించుకోవాలి. 

అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి.చీకటిలో వెలుగులు విరజిమ్మే పండుగ. దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుతీరతాయి.ఎంతో ప్రాముఖ్యం ఉన్న దీపాల్ని పెట్టేటప్పుడు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం..ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని ఈ దీపావళికి పొరపాటు చేయకుండా దీపం వెలిగించండి. దాని కోసం ఏం చేయాలో తెలుసుకుందాం..

దీపం సర్వతమోపహం
దీపో హరతుమే పాపం
దీపలక్ష్మీ నమోస్తుతే..అంటూ దీపాల్ని వెలిగించాలి. 

-దీపం సాక్షాత్తు దేవతా స్వరూపం. దీపం అడుగుభాగంలో బ్రహ్మ దేవుడు..మధ్యలో శ్రీ మమావిష్ణువు..ప్రమిదలో పరమ శివుడు.. ఆ దీపం వెలుగులో సరస్వతి,నిప్పుకణికలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని శాస్త్రం చెబుతోంది. అందుకే ప్రమిదకు గంధం,కుంకుమ బొట్టు ..పూవులు పెట్టి, నమస్కరించి అక్షతలు వేసి పూజిస్తారు. దీపానికి నైవేధ్యం కూడా సమర్పించాలి.

-దీపారాధన చేయటానికి వెండి..ఇత్తడి ప్రమిదలకు కంటే మట్టి ప్రమిదలే మంచిది. లోహాలు వేడెక్కుతుంది. దీంతో  భూమి వేడెక్కుతుంది. అదే మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి.ఇళ్లల్లో పూజకు వాడేప్పుడు వెండి,ఇత్తడి ప్రమిదలు వాడొచ్చు కానీ స్టీలు ప్రమిదలు వాడకూడదు.

-దీపంలో  వత్తులు ఎన్ని పడితే అన్ని,ఎలా పడితే అలా వేసి దీపం వెలిగించకూడదు.దీపంలో రెండు   వత్తులు వేసి..ఆ రెండిటిని  కలిపి దీపం వెలిగించాలి.

-దీపం అనగానే ఆముదంతో లేదా నూనెతో వెలిగిస్తుంటారు.కానీ పండుగనాడైనా ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించాలి..నెయ్యి లేకుంటే నువ్వుల నూనె వాడడం మంచిది.

-దీపాన్ని వెలిగించాక దీపం ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెబుతోంది. త్రిలోకాధిపత్యంతో పాటు సర్వ సంపదలు కోల్పోయిన దేవేంద్రుడు దీపారధన చేయటం వలననే తిరిగి పోగొట్టుకున్న సిరిసంపదలతో పాటు త్రిలోకాథిపత్యం కూడా పొందాడట. అందుకే దీపావళినాడు దీపాలు పెట్టిన ఇంట సకల ఐశ్వర్యాలు కొలువవుతాయని పురాణాలు చెబుతున్నాయి.