NZ vs Afg T20 : మ్యాచ్‌కు కొన్ని గంట ముందు క్యూరేటర్ సూసైడ్

యూఏఈ వేదికగా జరుగుతున్నటీ20 వరల్డ్ కప్‌లో విషాదం చోటుచేసుకుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం చీఫ్ క్యురేటర్‌గా పనిచేస్తున్న ఇండియన్ మోహన్ సింగ్ సూసైడ్ చేసుకున్నారు.

Nz Vs Afg T20

NZ vs Afg T20 : యూఏఈ వేదికగా జరుగుతున్నటీ20 వరల్డ్ కప్‌లో విషాదం చోటుచేసుకుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం చీఫ్ క్యురేటర్‌గా పనిచేస్తున్న ఇండియన్ మోహన్ సింగ్ సూసైడ్ చేసుకున్నారు. అఫ్ఘానిస్తాన్ – న్యూజిలాండ్ మ్యాచ్‌‌కి గంట ముందు పీచ్‌ను పరిశీలించిన సింగ్ అనంతరం తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చదవండి : NZ vs Afg T20: న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం.. భారత్ ఆశలు గల్లంతేనా?

మోహన్ మృతి పట్ల అబుదాబి క్రికెట్ ,ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సంతాపం వ్యక్తం చేశాయి. కానీ, తన మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించడలేదు. కాగా మోహన్ కు భార్య ఓ కూతురు ఉన్నారు. 2000 సంవత్సరంలో యూఏఈ వెళ్లిన మోహన్ అప్పటి నుంచి షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం పిచ్ క్యూరేటర్ గా పనిచేస్తున్నారు. గతకొంతకాలంగా మోహన్ డిప్రెషన్‌లో ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

చదవండి : ICC T20 : ప్రమాదం నుంచి తప్పించుకున్న అంపైర్..వీడియో వైరల్