Arshdeep Singh creates history becames Most wickets for India in T20 World Cup history
Arshdeep Singh : టీమ్ఇండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు.
గురువారం చెన్నైలోని చెపాక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు తీయడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు జస్ప్రీత్ బుమ్రాను అధిగమించాడు. బుమ్రా 23 మ్యాచ్ల్లో 33 వికెట్లు తీయగా అర్ష్దీప్ సింగ్ 19 మ్యాచ్ల్లోనే 35 వికెట్లు పడగొట్టాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..
* అర్ష్దీప్ సింగ్ – 19 మ్యాచ్ల్లో 35 వికెట్లు
* జస్ప్రీత్ బుమ్రా – 23 మ్యాచ్ల్లో 33 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 24 మ్యాచ్ల్లో 32 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 30 మ్యాచ్ల్లో 29 వికెట్లు
* రవీంద్ర జడేజా – 30 మ్యాచ్ల్లో 22 వికెట్లు
ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2026లో అర్ష్దీప్ సింగ్ ఐదు మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (55; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (50నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), తిలక్ వర్మ (44 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు రాణించారు.
అనంతరం 257 పరుగుల భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్; 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సికిందర్ రజా (31 ;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబె లు తలా ఓ వికెట్ తీశారు.