Asian Games 2023: ఆర్చరీ క్రీడలో జ్యోతి సురేఖ, ఓజాస్ డియోటాలకు స్వర్ణ పతకం
ఆసియా క్రీడల ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ డియోటాలే స్వర్ణం గెలుచుకున్నారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దక్షిణ కొరియాను ఓడించడంతో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత్కు 16వ బంగారు పతకాన్ని లభించింది....
- saleem sk
- Published On : October 4, 2023 / 09:44 AM IST
Jyothi Surekha,Ojas Deotale
Asian Games 2023: ఆసియా క్రీడల ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ డియోటాలే స్వర్ణం గెలుచుకున్నారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దక్షిణ కొరియాను ఓడించడంతో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత్కు 16వ బంగారు పతకాన్ని లభించింది. స్వర్ణ పతక పోరులో జ్యోతి, ఓజాస్ ద్వయం 159-158తో కొరియాకు చెందిన సో చైవాన్, జూ జేహూన్లను ఓడించింది. హాంగ్జౌ గేమ్స్లో ఇది భారత్కు 71వ పతకం. ఇది ఆసియా క్రీడల్లో వారి అత్యుత్తమ పతకం.
Also Read : Delhi liquor policy case : ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ తనిఖీలు
అంతకుముందు 35 కిలోమీటర్ల రేస్ వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్య పతకం సాధించింది. ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా తన పురుషుల జావెలిన్ త్రో బంగారు పతకాన్ని కాపాడుకోనున్నారు. లవ్లీనా బోర్గోహైన్ బుధవారం జరిగే మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో చైనాకు చెందిన లీ కియాన్తో పోటీపడనున్నారు.
