ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచుకు పూర్తిస్థాయిలో ఫిట్గా ఉండేందుకు ప్రాక్టీసుకు దూరంగా ఉంది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడడంతో పాటు చెన్నైలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో హైదరాబాద్ ఆటగాళ్లు ఇవాళ ప్రాక్టీస్ చేయలేదు.
అలాగే, కోల్కతా నైట్రైడర్స్ చివరిసారిగా గత మంగళవారం మ్యాచ్ ఆడింది. ఆ జట్టు ఇప్పటివరకు మరో మ్యాచ్ ఆడకపోవడంతో టీమ్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది.
Two forces. One goal. Game on! 🏆 pic.twitter.com/GSKrl6qD0N
— KolkataKnightRiders (@KKRiders) May 25, 2024
ట్రోఫీతో ఫొటోలు
కోల్కతా, హైదరాబాద్ కెప్టెన్లు ఇవాళ ఐపీఎల్ 2024 ట్రోఫీతో ఫొటోలు దిగారు. శ్రేయాస్ అయ్యర్, కమిన్స్ ఫొటోలను ఐపీఎల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి చూడొచ్చు. ఐపీఎల్ 2024లో కోల్కతా, హైదరాబాద్ జట్లు మొదటి నుంచి అద్భుతంగా ఆడుతున్నాయి.
క్వాలిఫయర్ 1 మ్యాచులో కోల్కతా టీమ్ చేతిలో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. క్వాలిఫయర్ 2 రూపంలో హైదరాబాద్ తనకు ఉన్న అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని ఫైనల్ చేరింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Two Captains. One Trophy 🏆
..And an eventful Chennai evening 🛺🏖️
All eyes on the #Final 😎#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/5i0nfuWTGN
— IndianPremierLeague (@IPL) May 25, 2024