Dhruv Jurel : ధ్రువ్ జురెల్ సెంచ‌రీ మిస్‌.. ఇంగ్లాండ్‌కు స్వ‌ల్ప ఆధిక్యం

రాంచీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆట‌గాడు ధ్రువ్ జురెల్ తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు.

Dhruv Jurel

Shoaib Bashir – IND vs ENG : రాంచీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆట‌గాడు ధ్రువ్ జురెల్ (90; 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

దీంతో ఇంగ్లాండ్‌కు 46 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో యువ స్పిన్న‌ర్ షోయ‌బ్ బ‌షీర్ ఐదు వికెట్ల‌తో భార‌త్‌ను దెబ్బ‌తీశాడు. టామ్‌హార్డ్లీ మూడు వికెట్లు, జేమ్స్ అండ‌ర్స‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

88 ప‌రుగులు మూడు వికెట్లు..

ఓవ‌ర్ నైట్ స్కోరు 219/7 తో మూడో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త్ మ‌రో 88 ప‌రుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 30 ప‌రుగుల‌తో ఆట‌ను ఆరంభించిన ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. కుల్దీప్ యాద‌వ్ (28) కొద్ది సేప‌టికే పెవిలియ‌న్‌కు చేరుకున్నా ఆకాశ్ దీప్ (9) జ‌త‌గా చెల‌రేగిపోయాడు.

బ‌షీర్ ను టార్గెట్ చేసి అత‌డి బౌలింగ్‌లో సిక్స‌ర్లు, ఫోర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఆకాశ్ దీప్ ఔటైన త‌రువాత సెంచ‌రీకి 10 ప‌రుగుల దూరంలో ధ్రువ్‌జురెల్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.

WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్‌లో విరాట్ కోహ్లి కొడుకు అకాయ్‌కు స్వాగ‌తం ప‌లికిన అభిమానులు

ట్రెండింగ్ వార్తలు