టీమిండియా వన్డే సిరీస్ లో శుభారంభాన్ని నమోదు చేసుకుంది. దీంతో హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసినట్లు అయింది. గతంలో ఇక్కడ జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 2007లో జరిగిన మ్యాచ్ లో భారత్ను 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మ్యాచులోనూ భారత్ ఓటమి పాలైంది.
ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు కలిగిన ఆస్ట్రేలియా దానిని కాపాడుకోవాలని భావిస్తుండగా, పుష్కర కాలంగా దక్కని విజయాన్ని అందుకోవాలని ఎదురుచూసింది. ఎట్టకేలకు శనివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీసేన ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే విజయం చేజిక్కించుకుంది. టీ20 సిరీస్ వైఫల్యంపై కంగారూలపై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉప్పల్ వేదికగా ఆసీస్ ను శాసించింది.
భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు తన పర్యటనల్లో ఇప్పటివరకు 26 మ్యాచ్లు గెలిస్తే, భారత్ 25 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.