Teamindia
IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ ఇవాళ్టి నుంచి రాంచి వేదికగా ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ లలో 2-1 ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతుంది. వరుస విజయాలతో భారత్ జట్టు ఆటగాళ్లు జోరు మీదున్నారు. టీమిండియా సొంతగడ్డపై వరుసగా 17వ సిరీస్ పై కన్నేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో రాంచీలో విజయమే లక్ష్యంగా టీమిండియా ప్లేయర్స్ సన్నద్ధమవుతున్నారు.
Also Read : Ben Stokes : రాంచీ టెస్టు ముందు బెన్స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. ఇదేం పిచ్రా బాబు!
రాంచీ మైదానంలో మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మిగిలిన ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
4⃣th Test Loading! ⌛️#TeamIndia is READY! 👏 👏
ARE YOU❓#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/yN0fCLreb4
— BCCI (@BCCI) February 22, 2024