Ind Vs Nz 1st T20I : న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భారత్ ఓటమి

న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్ లో అదే జోరు చూపించలేకపోయింది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది.

Ind Vs Nz 1st T20I : వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్ లో అదే జోరు చూపించలేకపోయింది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50) చివర్లో హాఫ్ సెంచరీతో పోరాడినప్పటికీ టీమిండియాకు పరాజయం తప్పలేదు.

Also Read..Jessie Lemonier: క్రీడారంగంలో విషాదం.. పాతికేళ్లకే మరణించిన ఫుట్‌బాలర్… గర్భంతో ఉన్న ప్రేయసి

ఆరంభంలోనే 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. గిల్ 7, ఇషాన్ కిషన్ 4 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ 47(34 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో జట్టును ఆదుకున్నారు. అయితే వారిద్దరూ ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నడిపించే భారం వాషింగ్టన్ సుందర్ పై పడింది. అతడికి మరో ఎండ్ నుంచి సహకారం కరవైంది. దాంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్, శాంట్నర్, ఫెర్గుసన్ చెరో 2 వికెట్లు తీశారు. డఫీ, సోధీ తలో వికెట్ తీశారు.

Also Read..Sania Mirza: చివరి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా.. వీడియో వైరల్

అంతకుముందు, న్యూజిలాండ్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో కివీస్ లీడ్ లో ఉంది. లక్నోలో ఈ నెల 29న ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు