ఈ ఏడాది చివర్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఈ సిరీస్ కంటే ముందు భారత ఏ, ఆస్ట్రేలియా ఏ జట్లు రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడనున్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు మ్యాచ్లను మాకేలోని గ్రేట్ బారియర్ రీఫ్ ఎరీనాలో, ఎంసీజీలో నిర్వహించనున్నారు.
మొదటి మ్యాచ్ను అక్టోబర్ 31- నవంబర్ 3 మధ్య, రెండో మ్యాచ్ నవంబర్ 7 – 10 వరకు జరగనుంది. ఈ రెండు మ్యాచుల వల్ల టెస్టు సిరీస్లో ఎంపిక చేసే ఆటగాళ్లను ఇందులో పరీక్షించే అవకాశం ఇరు జట్లకు ఉంటుందని సీఏ హెడ్ పీటర్ రోచ్ తెలిపారు.
Viral Video : ఈవీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. రనౌట్ చేసేందుకు చిన్నారుల పాట్లు.. అయ్యో పాపం
ఐదు టెస్టులు..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. నవంబర్ 22 నుంచి జనవరి 7 వరకు పెర్త్ స్టేడియం, అడిలైడ్ ఓవల్, గబ్బా, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లలోఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్కు ముందు టీమ్ఇండియా డబ్ల్యూఏసీఏ గ్రౌండ్లో మూడు రోజుల ఇంట్రా-స్వ్కాడ్ మ్యాచ్ను ఆడనుంది.
కాగా.. 2017 నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోలేదు. 2018-19, 2020-21 సీజన్లలో జరిగిన సిరీస్లను టీమ్ఇండియా విజయం సాధించింది. ఈ సారి కూడా గెలిచి వరుసగా మూడు సార్లు ట్రోఫీని అందుకున్న జట్టుగా నిలవాలని భారత జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
The rivalry continues to grow ?
Australia A will take on India A as a prelude to the Border-Gavaskar Trophy this summer as the two top-ranked Test nations prepare for their hugely anticipated showdown. pic.twitter.com/53fZJpGI4k
— Cricket Australia (@CricketAus) May 28, 2024