అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ సంచలనం యశస్వి జైశ్వాల్ మరోసారి అద్భుతంగా రాణించాడు. క్లిష్టపరిస్థితుల్లో తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్తో ఫైనల్ పోరులో యశస్వి(88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకంతో రాణించడంతో యువ భారత్ మెరుగైన స్కోరు చేసింది. ఆరంభంలో తిలక్వర్మ(38: 65 బంతుల్లో 3ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ అందించాడు. అయితే మిగిలినవారు పెద్దగా రాణించకపోవడంతో భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది.
చివరిగా ధ్రేవ్ జురేల్(22) ధ్రేవ్ జురేల్(22) అనూహ్యంగా రనౌట్ కావడంతో భారత్ మంచి స్కోరు చేసే అవకాశం మిస్సయ్యింది. ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు, ఫీల్డర్లు మెరుగైన ఆటతీరుతో భారత్పై ఆధిపత్యం చలాయించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆఖరి వరకు బౌలర్లు క్రమశిక్షణతో బంతులేయగా భారత జట్టు స్కోరు బోర్డు పెద్దగా కదలలేదు. బంగ్లా బౌలర్లలో అవిషేక్ దాస్(3/40), ఇస్లాం(2/31), హసన్ షకీబ్(2/28) భారత్ను భారీ దెబ్బకొట్టారు.
టోర్నీ మొత్తం రాణించిన జైస్వాల్.. బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ సెంచరీ దిశగా దూసుకెళ్లినా.. ఇస్లాం బౌలింగ్లో వెనుదిరగడంతో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత అండర్-19 వరల్డ్కప్లో 133 సగటుతో 400 పరుగులను సాధించాడు జైశ్వాల్. అందులో నాలుగు అర్ధశతకాలు, ఒక శతకం ఉంది.
Ankolekar chops Avishek Das onto his stumps, and that’s the eighth wicket Bangladesh have taken today.
India have lost five wickets for just 14 runs. #U19CWC | #INDvBAN | #FutureStars pic.twitter.com/GAAoeOnQyn
— Cricket World Cup (@cricketworldcup) February 9, 2020