U19 World Cup: ఐదోసారి అండర్ 19 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన యంగ్ ఇండియా
ఇండియా మరోసారి సత్తా చాటింది. ఐదోసారి అండర్-19 వరల్డ్ గెలిచి చరిత్ర సృష్టించింది. శనివారం ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అత్యద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టి...
- Subhan Ali Shaik
- Published On : February 6, 2022 / 06:12 AM IST
Under 19 Teamindia
U19 World Cup: ఇండియా మరోసారి సత్తా చాటింది. ఐదోసారి అండర్-19 వరల్డ్ గెలిచి చరిత్ర సృష్టించింది. శనివారం ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అత్యద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా పెట్టిన ఆంక్షలను తూచా తప్పకుండా పాటిస్తూ.. మరోసారి వరల్డ్ క్లాస్ టీంగా నిలిచింది ఇండియన్ అండర్-19 టీం.
ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ను 189 పరుగులకే కట్టడి చేసింది. చేధన దిశగా పోరాడిన టీమిండియా 14 బంతులు మిగిలిఉండగానే విజయాన్ని ముద్దాడింది. అండర్-19 ప్రపంచకప్ను భారత్ ఖాతాలో ఐదోసారి చేర్చారు కుర్రాళ్లు.
భారత జట్టు చేసిన బ్యాటింగ్లో నిషాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్ కీపర్ దినేశ్ బనా 190 పరుగుల లక్ష్యాన్ని రెండు సిక్సులతో పూర్తి చేశాడు. వైస్ కెప్టెన్ షేక్ రషీద్, నిషాత్ సింధూ సరిగ్గా హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. రాజ్ బవా 35 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ సేల్స్, బోయ్డెన్, అస్పిన్వాల్ తలా రెండు వికెట్లు తీశారు.
Read Also: ఇది టైం కాదు.. టెస్టు కెప్టెన్సీ గురించి మరిచిపోండి – రోహిత్ శర్మ
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. బ్యాటర్ జేమ్స్ (95; 12 ఫోర్లు) అద్భుతమైన ఆట కనబరిచాడు.టెయిలెండర్ జేమ్స్ సేల్స్(34)తో కలిసి ఆడి ఎనిమిదో వికెట్కు 5 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రాజ్ బవా నిలిచాడు. ప్లేయర్ ఆప్ ద సిరీస్ ను సౌతాఫ్రికా ప్లేయర్ డేవాల్డ్ బ్రేవీస్ సొంతం చేసుకున్నాడు.
