Rohit sharma
Rohit Sharma : ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ వద్దకు పరుగు తీసుకుంటూ వెళ్లాడు. అయితే రోహిత్ భయాందోళనకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : IPL 2024 : మూడో మ్యాచ్లోనూ ఓడిపోయిన ముంబై జట్టు.. హార్ధిక్ కెప్టెన్సీ ఊడినట్లేనా!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ స్లిప్ లో ఉన్నాడు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ కు రోహిత్ సూచనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. అభిమాని దగ్గరికి వచ్చే వరకు రోహిత్ శర్మ అతన్ని గమనించలేదు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ రోహిత్ వెనక్కు చూడు అంటూ సూచించడంతో రోహిత్ వెనక్కు మళ్లేసరికి అభిమాని అతనిదగ్గరకి చేరిపోయాడు.. దీంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా భయాందోళనకు గురై రెండు అడుగులు వెనక్కు వేశాడు. అభిమాని అని గుర్తించి అతనికోరిక మేరకు ఓ హగ్ ఇచ్చాడు.. ఆ తరువాత పక్కనే ఉన్న ఇషాంత్ కిషన్ వద్దకు వెళ్లగా.. ఇషాంత్ సైతం రోహిత్ అభిమానికి హగ్ ఇచ్చాడు. దీంతో అతడు సంతోషంతో గెంతులేస్తూ గ్రౌండ్ లోనుంచి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు.
Also Read : Sourav Ganguly : పంత్ హాఫ్ సెంచరీ పై గంగూలీ కామెంట్స్.. ఇంతకంటే మంచి ఇన్నింగ్స్లు ఎన్ని ఆడినా కూడా..
ఇదిలాఉంటే.. వరుసగా మూడోసారి ఓటమితో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో కిందిస్థానంలోకి వెళ్లిపోయింది. టోర్నీలో అన్నిజట్లు ఖాతా తెరిచినప్పటికీ ముంబై జట్టు మాత్రం ఒక్క మ్యాచ్ లోకూడా విజయం సాధించలేక పోయింది. మూడు మ్యాచ్ లలో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
A fan hugged Rohit Sharma! ❤️
– The crowd favourite, Hitman. 💥 pic.twitter.com/cHgy6Z7IeV
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2024
A fan entered into the ground & hugged Rohit Sharma in Wankhede…!!!!pic.twitter.com/tWDVtfQYmD
— Johns. (@CricCrazyJohns) April 1, 2024