IPL 2024: ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకు? హార్దిక్ పాండ్యాపై విమర్శల వెల్లువ

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రికార్డు స్థాయి స్కోర్ నమోదు చేయడానికి హార్ధిక్ పాండ్యా నాయకత్వ లోపమేనని ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

Rohit Sharma And Hardik Pandya : ఐపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టును కష్టాలు వెంటాడుతున్నాయి. ఐపీఎల్ ఫార్మాట్ లో ఐదు సార్లు జట్టుకు ట్రోపీని తీసుకొచ్చిన రోహిత్ శర్మను కాదని ముంబై జట్టు యాజమాన్యం గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి హార్ధిక పాండ్యాను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ, హార్దిక్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రెండు మ్యాచ్ లలోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైంది. మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఓటమి చెందినప్పటికీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై భారీ ఓటమిని ముంబై ఇండియన్స్ జట్టు ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి 277 పరుగులు నమోదు కావటం.. అదీ ముంబై జట్టు బౌలింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి కొట్టడం ముంబై ఫ్యాన్స్ కు తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది.

Also Read : IPL 2024 : రోహిత్ శర్మ ఔట్ అవ్వగానే కావ్య పాప సూపర్ డ్యాన్స్.. వీడియోలు వైరల్

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రికార్డు స్థాయి స్కోర్ నమోదు చేయడానికి హార్ధిక్ పాండ్యా నాయకత్వ లోపమేనని ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినందుకు ఆగ్రహంతో ఊగిపోతున్న ముంబై జట్టు ఫ్యాన్స్.. ఇప్పుడు ఆ జట్టు బౌలింగ్ పేలవంగా ఉండటం.. సన్ రైజర్స్ జట్టు రికార్డు స్కోర్ చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. బౌలింగ్ మార్పులు చేయడంలో హార్దిక్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేయలేక పోయారన్న వాదనను పలువురు మాజీ క్రికెటర్లు తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్ లాంటి మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా పేవలమైన కెప్టెన్సీ వల్లనే ముంబై జట్టు ఓటమి పాలవుతుందని చెప్పారు. ఈ క్రమంలో మరోసారి రోహిత్ శర్మకే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను యాజమాన్యం అప్పగిస్తుందన్న ఆశతో ముంబై ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Also Read : సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్.. క్లాసెన్ కూతురి వీడియో వైరల్

ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ వెళ్లాలని ఆదేశిస్తున్నట్లు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా నిరూపించుకోవాలంటే ముంబై ఇండియన్స్ జట్టు ఆడే మరుసటి మ్యాచ్ ల్లో జట్టు కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. లేకుంటే హార్ధిక్ పాండ్యాకు కష్టాలు మరింత ఎక్కువైనట్లేనని చెప్పొచ్చు.

ట్రెండింగ్ వార్తలు