ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల ఫొటో షూట్.. పిక్ వైరల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రోఫీతో కెప్టెన్లు అందరూ దిగిన ఫొటో వైరల్ గా మారింది.

IPL 2024 Captains Photoshoot: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలో జరిగే మ్యాచ్ తో ఈ మెగా టోర్ని ప్రారంభం కాబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్స్ కెప్టెన్స్ అందరూ ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్లు ఫొటోకు ఫోజు ఇచ్చారు.

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరపున రుతురాజ్ గైక్వాడ్ ఫొటో షూట్‌లో పాల్గొనడడం విశేషం. ఈ సీజన్ కు సీఎస్కే కెప్టెన్ గా అతడు వ్యవహరిస్తాడని ఈ ఫొటోతో క్లారిటీ ఇచ్చినట్టయింది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌గా పాట్ కమిన్స్ వ్యవహరిస్తాడు. మొత్తం పది జట్లలో 8 టీమ్‌ల‌కు టీమిండియా ప్లేయర్లు కెప్టెన్లుగా ఉన్నారు. యువ ఆటగాళ్లు శుభమాన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, సంజూ శామ్సన్‌తో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధవన్.. కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

ఐపీఎల్ కెప్టెన్లు వీరే..
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్
గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్
కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌: శ్రేయస్ అయ్యర్
రాజస్థాయన్ రాయల్స్: సంజూ శామ్సన్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: డు ప్లెసిస్
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్: పాట్ కమిన్స్

Also Read: ఐపీఎల్‌లో లక్కీ చాన్స్ కొట్టిన యంగ్ క్రికెటర్.. ఆ జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపిక

ట్రెండింగ్ వార్తలు