IND vs IRE: టీమిండియాకు ఘోర పరాభవం.. టీ20 సిరీస్ 0-2తో ఐర్లాండ్ కైవసం.. ఒకే ఒక పరుగు తేడాతో..

ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా(IND vs IRE)కు ఊహించని ఘోర పరాభవం ఎదురైంది.

Ireland achieved a one-run victory over India in the 2nd ODI match

  • ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవం

  • టీ20 సిరీస్ చేజార్చుకున్న భారత్

  • ఒక్క పరుగుతో ఓడిన టీమిండియా

IND vs IRE: ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు ఊహించని ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌-2026 ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. ఐరిష్ గడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై సిరీస్‌ను 0-2తో పూర్తిగా చేజార్చుకుంది. బెల్‌ఫాస్ట్‌లోని స్టార్మాంట్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఐర్లాండ్ జట్టు 1 పరుగు తేడాతో భారత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Cm Revanth Reddy: ఒట్టేసి చెబుతున్నా.. మళ్లీ కేసీఆర్ రావడం అనేది జరగదు.. ప్రతిపక్షాలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్(IND vs IRE) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం ఒక్క పరుగు తేడాతో విజయాన్ని ముద్దాడిన ఐర్లాండ్ చారిత్రాత్మక రీతిలో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత జట్టు, పసికూనగా భావించే ఐర్లాండ్ చేతిలో ఇలా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారత బ్యాటింగ్ వైఫల్యంతో పాటు, చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐరిష్ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్‌ను కట్టడి చేశారు. ఈ ఓటమితో టీమిండియా పర్యటన తీవ్ర పరాజయంతో ముగిసింది.