KL Rahul: ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇటీవలే బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్కు భారత జట్టు సహచరులు, స్నేహితులు అయిన ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ ఖరీదైన పెళ్లి కానుకలు ఇచ్చినట్లు సమాచారం.
Republic Day parade: భారత గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ.. తొలిసారి పరేడ్ నిర్వహించిన సైన్యం
ఇద్దరూ వేర్వేరుగా ఇచ్చిన కానుకల విలువ దాదాపు రూ.3.50 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. ఎమ్మెస్ ధోని రూ.80 లక్షల విలువైన కవాసాకి నింజా బైక్ కానుకగా ఇచ్చాడు. మరో స్టార్ ప్లేయర్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ కలిపి రూ.2.70 లక్షల విలువైన బీఎమ్డబ్ల్యూ కారును రాహుల్-అతియా శెట్టికి బహూకరించారు. ధోని కెప్టెన్గా వ్యవహరించిన సమయంలోనే కేఎల్ రాహుల్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. రాహుల్ తన తొలి వన్డే, తొలి అంతర్జాతీయ టీ20ని ధోని కెప్టెన్సీలోనే ఆడాడు. అందువల్ల అప్పటి నుంచి ధోని-రాహుల్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్కు కవాసాకి నింజా హెచ్2ఆర్ అనే బైక్ను బహూకరించాడు.
Republic Day Celebrations: ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయంటే
దీని విలువ దాదాపు రూ.79,90,900గా ఉంది. ధోని, కోహ్లీ ఇద్దరూ రాహుల్కు బహుమతులు అందించినప్పటికీ, వాళ్లు పెళ్లికి హాజరుకాలేదు. రాహుల్-అతియా.. ఖండాలాలోని విలాసవంతమైన ప్యాలెస్లో అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. అతిథుల్ని ఎవరినీ పెద్దగా ఆహ్వానించలేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొద్దిమంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్-అతియా జంటకు ఇటు క్రీడారంగం నుంచి అటు సినిమా రంగం నుంచి బహమతులు, అభినందనలు వెల్లువెత్తాయి.
సినిమా ఇండస్ట్రీలో అతియా తండ్రి సునీల్ శెట్టికి అత్యంత సన్నిహితులైన సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్ కూడా కొత్త జంటకు బహుమతులు అందించినట్లు తెలుస్తోంది. సునీల్ శెట్టి కూడా కొత్త జంటకు రూ.50 విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ బహూకరించినట్లు సమాచారం.